తెలుగు న్యూస్ ప్రింట్ ప్రజల స్వరం • నిజమైన వార్తలు
ప్రింట్ తేదీ: অগাস্ট ২৬, ২০২৬, ৪:৩৮ পি.এম ప్రచురణ తేదీ: জুলাই ১৩, ২০২৬, ৬:৪৪ এ.এম
BREAKING NEWS

పంట నమోదు ఈ. క్రాప్ తప్పని అవసరం: సొసైటీ అధ్యక్షుడు ముప్పన కేశవ్

పంట నమోదు ఈ. క్రాప్ తప్పని అవసరం: సొసైటీ అధ్యక్షుడు ముప్పన కేశవ్

పోలవరం జిల్లావాణి ప్రతినిధి: రాజవోమ్మంగి వ్యవసాయ సహకార సంఘం (సొసైటీ) కార్యాలయం వద్ద గత కొన్నిరోజులుగా వ్యవసాయ ఎరువులు యూరియా ఇవ్వడం జరుగుతుందని రాజవోమ్మంగి మండల వ్యవసాయ సహకార సంఘం సొసైటీ అధ్యక్షుడు ముప్పన కేశవ్ అన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎరువుల కోసం వచ్చే రైతులు తప్పకుండా ఆన్లైలో రైతుల యొక్క పంట నమోదు (ఈ. క్రాప్ బుకింగ్) చేయించుకుని రావలని ఆయన పేర్కొన్నారు. పంట నమోదు ఇంకా చేయించలేని రైతులు సచివాలయం వివేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ ను సంప్రదించి పంట నమోదు చేయించుకోని రావలని సొసైటీ చైర్మన్ కోరారు. పంట నమోదు ఆన్లైన్ కానీ పక్షంలో ఎరువులు ఇవ్వడం జరగదన్నారు. మండలంలోని రైతులు అందరూ సదరు విషయాలను గమనించి ఆన్లైన్ చేసుకోవాలని ఆయన సూచించారు.