కిర్లంపూడి, జూలై 16: మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం మృతి రాష్ట్ర రాజకీయాలకు తీరని లోటని టీడీపీ పొలిట్బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు అన్నారు.గురువారం కిర్లంపూడిలో ముద్రగడ పద్మనాభం నివాసానికి చేరుకున్న యనమల రామకృష్ణుడు, ఆయన తనయులు ముద్రగడ బాలు, ముద్రగడ గిరిని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు.ఈ సందర్భంగా ముద్రగడ పద్మనాభంతో తనకున్న సుదీర్ఘ అనుబంధాన్ని యనమల రామకృష్ణుడు గుర్తు చేసుకున్నారు. ముద్రగడ నీతి, నిజాయితీకి కట్టుబడి పనిచేసిన నాయకుడని, ప్రజా సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ కృషి చేశారని కొనియాడారు. రాష్ట్ర రాజకీయాల్లో ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమని, ఆయన మృతి ప్రజలకు, రాజకీయ రంగానికి తీరని లోటని పేర్కొన్నారు.
