తెలుగు న్యూస్ ప్రింట్ ప్రజల స్వరం • నిజమైన వార్తలు
ప్రింట్ తేదీ: অগাস্ট ২৫, ২০২৬, ২:৪৯ পি.এম ప్రచురణ తేదీ: জুলাই ১৮, ২০২৬, ৯:৪৮ এ.এম
BREAKING NEWS

అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం వెంకటాపురం గ్రామంలో అక్రమ మైనింగ్ వ్యతిరేకంగా ధర్మ పోరాట దీక్ష చేపట్టిన ఎలమంచిలి నియోజవర్గ సమన్వకర్త కరణం ధర్మశ్రీ

అనకాపల్లి జిల్లా ఎలమంచిలి నియోజవర్గం రాంబిల్లి మండలం వెంకటాపురం వద్ద పవిత్ర పుణ్యక్షేత్రమైన శ్రీ ఉమా ధర్మ లింగేశ్వర స్వామి దేవాలయం పంచదారలో దారలు కలుషితం అవడంతో కూటమి ప్రభుత్వం చేస్తున్న అక్రమమైనింగ్ వలన దారలు కలుషితమయ్యాయని ఎలమంచిలి నియోజవర్గ సమన్వయకర్త కర్ణం ధర్మశ్రీ ఆధ్వర్యంలో ధర్మ పోరాట దీక్ష పేరిట రిలే నిరాహార దీక్షలు చేపట్టారు దీనికి మద్దతుగా ఉత్తరాంధ్ర రీజినల్ కోఆర్డినేటర్ మాజీ మంత్రి కురసాల కన్నబాబు మాజీ మంత్రి దాడిశెట్టి రాజా పశ్చిమగోదావరి జిల్లా రీజినల్ కోఆర్డినేటర్ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అనకాపల్లి జిల్లా అధ్యక్షులు బొడ్డేటి ప్రసాద్ మద్దతు తెలిపారు దానిలో భాగంగా మైనింగ్ జరిగే ప్రదేశాన్ని పరిశీలించారు అనంతరం కూటమి నాయకులపై విమర్శలు గుప్పించారు మాజీమంత్రి కురసాల కన్నబాబు మాట్లాడుతూ సేవ చేస్తావని నిన్ను ఎంపీగా గెలిపిస్తే అనకొండ వలే కొండలు కొల్లగొడుతున్నావని ఎంపీ సీఎం రమేష్ పై ఘాటు విమర్శలు మాజీ మంత్రి దాడిశెట్టి రాజా మాట్లాడుతూ ఎంతో పురాతన దేవాలయమైన ఉమా ధర్మలింగేశ్వర స్వామి వెలుచున్న కొండపై మైనింగ్ చేస్తూ స్థానిక ఎమ్మెల్యే మరియు ఎంపీ అక్రమస్తులు కూడుకుంటున్నారని వీళ్ళకి ప్రజాసమస్యలు కన్నా అక్రంగా మైనింగ్ చేసి ఆస్తులు కూడా కూడబెట్టి కోవడం మీద శ్రద్ధ ఎక్కువ ఉన్నదని విమర్శించారు మాజీమంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ నేను ఎలక్షన్ ముందే చెప్పానని ఇలాంటి వారిని గెలిపిస్తే ప్రభుత్వ ఆస్తులు ప్రజల ఆశ్రికి రక్షణ ఉండదని గద్దలవలే తన్నుకు పోతారని చెప్పానని గుర్తు చేశారు ఈకార్యక్రమంలో మండలాల అధ్యక్షులు సర్పంచులు ఎంపీటీసీలు పాల్గొన్నారు