
ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ నాయకుడు జయరాజ్ మాట్లాడుతూ, విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం నిర్వహిస్తున్న ఈ బంద్కు విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, మేధావులు మరియు ప్రజాసంఘాల ప్రతినిధులు పెద్ద ఎత్తున మద్దతు తెలిపి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
విద్యార్థుల భవిష్యత్తును కాపాడేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా ముందుకు వచ్చి 24వ తేదీన జరిగే బంద్లో భాగస్వాములు కావాలని వారు కోరారు.