
పాడేరు జిల్లావాణీ ప్రతినిథి: అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ప్రధాన కేంద్రంలో మారికవలస గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో విద్యార్థులను యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ పాడేరులో ప్రజా సంఘాల నేతలు, విద్యార్థుల కుటుంబీకులు అర్థనగ్న ప్రదర్శనతో ర్యాలీ నిర్వహించారు. మారికవలస గురుకులం నుంచి పంపించి వేసిన విద్యార్థులకు మరల తిరిగి యధావిధిగా అదే పాఠశాలలో కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొని వారు శాంతియుత నినాదాలతో నిరసన ప్రదర్శనలు చేశారు.