తెలుగు న్యూస్ ప్రింట్ ప్రజల స్వరం • నిజమైన వార్తలు
ప్రింట్ తేదీ: সেপ্টেম্বর ৪, ২০২৬, ১০:৩৬ পি.এম ప్రచురణ తేదీ: সেপ্টেম্বর ৪, ২০২৬, ২:৫৭ পি.এম
BREAKING NEWS

జగన్నాధపురం ప్రజలకు ఇంటింటికి నీటి సరఫరా

జగన్నాధపురం ప్రజలకు ఇంటింటికి నీటి సరఫరా

కోటనందూరు, జిల్లా వాణి ప్రతినిధి

కోటనందూరు మండలం జగన్నాధపురం గ్రామంలో తాగునీటికి గత కొంతకాలం నుంచి తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో టిడిపి సీనియర్ నేత మాతి రెడ్డి భాస్కర రావు ఆధ్వర్యంలో వాటర్ ట్యాంకర్ ను ఏర్పాటు చేసి ఇంటింటా మంచినీటి అందిస్తున్నారు. సమస్య చాలా పెద్దదిగా ఉండడంతో భాస్కరరావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో త్రాగునీటిని అందిస్తున్నారు. ఈ కార్యక్రమంలో మాతి రెడ్డి బాబులు గుడివాడ శ్రీను, భీమిరెడ్డి తాతబ్బాయి ,సుర్ల చిట్టిబాబు, నాయకులు కార్యకర్తలు అభిమానులు, ఆయనకు తోడుగా నిలిచారు.