HomeNationalధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా… స్పందించిన కాక్రోచ్ జనతా పార్టీ చీఫ్

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా… స్పందించిన కాక్రోచ్ జనతా పార్టీ చీఫ్

న్యూడిల్లి నీట్ పేపర్ లీకేజీ ఆరోపణల నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేశారు. దీనిని “విద్యార్థుల విజయం”గా అభివర్ణిస్తూ కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) శనివారం సంబరాలు నిర్వహించింది.ఈ పరిణామంపై సీజేపీ సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’ ద్వారా స్పందిస్తూ, తమ ప్రధాన డిమాండ్లలో ఒకటి నెరవేరిందని పేర్కొంది. “మహాత్మా గాంధీ స్ఫూర్తితో చేపట్టిన శాంతియుత పోరాటం ద్వారా లక్ష్యాలను సాధించవచ్చని నిరూపితమైంది. యువత పోరాటం ఫలించింది, ఈ విజయం దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థులందరిదీ” అని సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే వ్యాఖ్యానించారు. మంత్రి రాజీనామా వార్త తెలియగానే ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆందోళనకారులు హర్షం వ్యక్తం చేస్తూ సంబరాలు చేసుకున్నారు. ఈ సాయంత్రం 6:30 గంటలకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించనున్నట్లు పిలుపునిచ్చారు. దేశ యువత సాగించిన శాంతియుత నిరసన వృథా పోలేదని, వారి సత్తా ఏమిటో ఈ పోరాటం ద్వారా వెల్లడైందని పేర్కొన్నారు. ఈ విజయం విద్యార్థి లోకానిదని, ప్రజాస్వామ్యం అంటే ఇదేనని వారు కొనియాడారు. తమకు రాజకీయాలతో సంబంధం లేదని, తమ డిమాండ్లలో ఒకటి నెరవేరిందని తెలిపారు. మిగిలిన రెండు డిమాండ్లు కూడా నెరవేరే వరకు వేచి చూస్తామని స్పష్టం చేశారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై దాడికి పాల్పడిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయడంతో పాటు, విద్యావ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేసే వరకు తమ ఉద్యమం ఆగదని హెచ్చరించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular