పోలవరం జిల్లావాణి ప్రతినిధి: రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే ‘ఏపీ పునర్విభజన చట్ట సవరణ బిల్లు-2026’ను ఏకగ్రీవంగా ఆమోదించిన లోక్సభ.. బిల్లు ఆమోదంపై రంప చోడవరం ఎమ్మెల్యే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సంక్షేమ కమిటి చైర్ పర్సన్ మిరియాల శిరీషాదేవి హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆమె బుధవారం ప్రకటన విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల కలల రాజధాని అమరావతి చట్టబద్ధత బిల్లును లోక్ సభ ఆమోదం తెలపడం ఆనందోత్సాహాన్ని నింపిందన్నారు. అమరావతికి మద్దతు తెలిపిన కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోడీ, కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా లకు, లోక్ సభ ఎంపీలకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో అమరావతి అద్భుత రాజధాని నిర్మాణానికి మార్గం సుగమమైందన్నారు. అడుగడుగునా, అమరావతి రాజధానిపై ప్రజల్లో ఆత్మస్థైర్యం నింపుతూ ముందుకు సాగిన విజనరీ లీడర్ చంద్రబాబు ని కొనియాడారు. దేశమంతా అమరావతికి మద్దతుగా నిలిచిన క్షణం.. వైసీపీ వ్యతిరేకిస్తూ వాకౌట్ చేయడం ఆ పార్టీ అహాంకారానికి నిదర్శనమే అని ప్రజాకాంక్ష నెరవేరిందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ , విద్యా ఐటీ శాఖ మంత్రి యువనేత నారా లోకేష్ , కూటమి పెద్దల సమన్వయంతోనే దేశంలో తొలి చట్టబద్ధత కలిగిన రాజధానిగా ఆంధ్రప్రదేశ్ అవతరించ బోతుండటం ఆనందకరమని కొనియాడారు. ఏది ఏమైనా అనుభవం ముందు అహంకారం చిన్నబోయిందన్నారు. అమరావతి భావితరాల అభివృద్ధి ప్రదాతగా నిలుస్తుందన్నారు. అమరావతి రాజధాని విషయంలో పూటకో మాట మాట్లాడిన వైకాపా పార్టీ ద్వంద వైఖరి ఆకృత్యాలకు ప్రజలే బుద్ధిచెబుతారని ఆశాభావం వ్యక్తం చేశారు.ఇంతటితో వైకాపా పార్టీ అమరావతిపై నెలకొల్పిన అనిశ్చితికి ముగింపు పడటం ప్రజాభీష్టం గెలుపే అన్నారు.
