

అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం మండలం సైతారుపేట గ్రామంలో తొలి ఏకాదశ సందర్భంగా ఉదయం నుంచి ఆలయ అర్చకులు రామోజీ ఆధ్వర్యంలో స్వామివారికి అర్చనలు అభిషేకాలు నిర్వహించారు చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు సోమవారం దర్శించుకున్నారు ఆలయం గోవింద నామస్మరణతో మారుమోగింది సాయంత్రం గ్రామపరవీధుల్లో స్వామివారి ఊరేగింపు కార్యక్రమం ఉంటుందని ఆలయ కమిటీ తెలియజేసింది
