కోటనందూరు, జిల్లా వాణి ప్రతినిధి
కాకినాడ జిల్లా కోటనందూరు మండలం మండల బిజెపి పార్టీ అధ్యక్షులు మల్ల వీరబాబు ఆధ్వర్యంలో మండల బిజెపి నాయకులు అంతా కోటనందూరు ఎస్సైటి .రామకృష్ణకు
ఇటీవల కాకినాడలో విధులు నిర్వహిస్తున్న ఎ.ఈ నూకరాజు పై జరిగిన దాడి విషయంలో తీవ్రంగా ఖండిస్తున్నాము. ఒక ప్రభుత్వ ఉద్యోగిపై ఇలా దాడి జరగడం చాలా బాధాకరం. ఈ ఘటనకు కారణమైన వ్యక్తులను వెంటనే గుర్తించి, విచారణ జరిపి, చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము.
ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు పోలీస్ శాఖ తగిన భద్రతా చర్యలు చేపట్టాలని, బాధితుడు నూకరాజు కి న్యాయం జరిగేలా చూడాలని భారతీయ జనతా పార్టీ కోటనందూరు మండలం తరపున మేము అందరం ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నాము.ఈ విషయంలో మీరు వెంటనే స్పందించి నిందితులను అరెస్ట్ చేసి, బాధితునికి న్యాయం చేయగలరని ఆశిస్తున్నాము. అని బిజెపి నాయకులు, సుర్ల రమణ, గాడి జమీల్, యల్లపు నానాజీ, అంకంరెడ్డి మణిరాజ్, కర్రీ నారాయణస్వామి, ఆడారి శ్రీనివాస్, పిల్లా కిషోర్ , మాతిరెడ్డి రాంబాబు, రమణ,వినతి పత్రం అందజేశారు.
