పోలవరం,జిల్లావాణి ప్రతినిధి: రంపచోడవరం డివిజన్ రాజవొమ్మంగి మండల పరిధిలోని శరభవరం గ్రామ పంచాయతీ 516ఈ జాతీయ రహదారిపై గురువారం రాత్రి మూగ జీవులు అగస్మత్తుగా ద్విచక్ర వాహనానికి అడ్డు రావడంతో రెండు మోటార్ వాహనాలు ప్రమాదానికి గురైయ్యాయి. ఈ రోడ్డు ప్రమాదాలలో గొలుగొండ మండలం మల్లంపేట గ్రామానికీ చెందిన సీత అనే మహిళ ఘటన స్థలంలోనే మృత్యువాత పడింది. మరో ప్రమాదంలో రాజవొమ్మంగి నుండి బందమావిళ్ళు వెళుతున్న ఫనీంద్రకుమార్ కు తీవ్ర గాయాలు కాగా ఆయనను నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి హుటాహుటిన తరలించారు.
