పోలవరం జిల్లా వాణి ప్రతినిధి: రంపచోడవరం నియోజకవర్గ శాసన సభ్యురాలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గిరిజన సంక్షేమ కమిటీ చైర్పర్సన్ మిరియాల శిరీషాదేవి శనివారం ఉదయం స్థానిక రంపచోడవరం నియోజవర్గ ప్రధాన కేంద్రంలోని అంబేద్కర్ కూడలిలో ‘స్వచ్ఛ ఆంధ్ర-స్వర్ణ ఆంధ్ర’ కార్యక్రమంలో పాల్గొనీ కార్యక్రమం ముగిసిన అనంతరం, 11 గంటలకు రాజవొమ్మంగి మండలం పందికొండ గ్రామపంచాయతీలోని వట్టిగెడ్డ గ్రామంలోని పార్టీ క్యాంపు కార్యాలయంలో నియోజవర్గంలోని ఉన్న అన్ని మండలాల మండలాల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, క్లస్టర్ ఇన్చార్జీలు, ప్రధాన కార్యదర్శులతో సమావేశంలో పాల్గొంటారు.
