కోటనందూరు జిల్లా వాణి ప్రతినిధి
ఇటీవల గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొంది విశ్రాంతి తీసుకుంటున్న
జిల్లా తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి గాడిరాజబాబును
మాజీ ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు పరామర్శించారు.
కోటనందూరు మండలం కమత మల్లవరంలో గాడి రాజబాబు
పార్టీ శ్రేణులతో కలిసి తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు పరామర్శించారు.
ఆరోగ్యం గురించి అడిగితెలుసుకున్నారు. త్వరగా కోలుకొని ప్రజాక్షేత్రంలోకి వచ్చి సేవలు కొనసాగించాలని యనమల ఆకాంక్షించారు.
యనమల వెంట తుని మండల టీడీపీ అధ్యక్షుడు చింతంనీడి అబ్బాయి, మోతుకూరి వెంకటేష్ కోటనందూరు మండల టీడీపీ అధ్యక్షుడు పోతల సూరిబాబు, మార్కెట్ కమిటీ చైర్మన్ అంకంరెడ్డి రమేష్,లోవ దేవస్థానం చైర్మెన్ పెంటకోట భాస్కర సత్యనారాయణ, మాజీ చైర్మెన్
గొర్లి అచ్చయ్య నాయుడు,
డాక్టర్ వెలగా వెంకట కృష్ణారావు, అంకంరెడ్డి బుల్లిబాబు, షేక్ నవాబ్ జానీ,సుర్ల సింహాద్రి,ఎల్ ఎస్ ఎన్ మూర్తి బైలపూడి శ్రీరామ్మూర్తి, గుడివాడ తాతబాబు, చందక శ్రీను,కొరుప్రోలు రఘునాథ్, సామినీడి కృష్ణార్జున, తదితరులు వెంట ఉన్నారు.
