శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలంలో వెలుగు డిపార్ట్మెంట్ యందు వివో ఏ గా “16 “సంవత్సరాలనుండి పని చేస్తున్న నీలవేణి అనే దళిత మహిళా ఉద్యోగిని పై రాజకీయ అధికారులు ఒత్తిడి మేరకు సంబంధిత ఉద్యోగులు ఆకారణంగా ఉద్యోగం నుండి తొలగించారు. పై విషయములపై టెక్కలి నుండి సింహాచలం లో ఉన్నా వై రామ్ చైతన్య హైకోర్టు న్యాయ వాదిని ఈరోజు కలిసిను. ఈసందర్బంగా న్యాయ వాది రామ్ చైతన్య మాట్లాడుతూ బాధితురాలకు జరిగిన అన్యాయం పై భారత రాజ్యాంగం ఆర్టికల్ 16 ఆర్టికల్ 17 ఉల్లంఘించిన సంబంధిత అధికారులపై యస్సి ఎస్టీ అట్రాసిటీ కేసు పెడతామని,గతంలో గౌరవ హైకోర్టు wp నెం :17390/2024 (కరణం జయ కుమారి vs స్టేట్ అఫ్ ఆంధ్రప్రదేశ్ ) కేసు లో గౌరవ హైకోర్టుఇచ్చిన ఆదేశాలు పై సంబంధిత అధికారులపై రిట్ పిటిషన్ వేస్తాను అని బాధితురాలికి హామీ ఇచ్చారు.
