
12.07.2026న ఉదయం సుమారు 9:30 గంటలకు యలమంచిలి మండలం, పురుషోత్తపురం జంక్షన్ వద్ద ఒక రోడ్డు ప్రమాదం జరిగింది. పురుషోత్తపురం గ్రామానికి చెందిన సుమారు 70 ఏళ్ల శ్రీ దంతులూరి రామరాజు (తండ్రి సీతారామ రాజు), తన TVS XL వాహనం (రిజిస్ట్రేషన్ నంబర్ AP 31 DB 2667)పై రోడ్డు దాటుతుండగా ఈ ప్రమాదం సంభవించింది. ఆ సమయంలో, తుని నుండి అనకాపల్లి వైపు వెళ్తున్న ఒక ఐషర్ వ్యాన్ (రిజిస్ట్రేషన్ నంబర్ AP 31 TE 0136) అతివేగంగా, అజాగ్రత్తగా మరియు నిర్లక్ష్యంగా నడపబడి, రోడ్డు దాటుతున్న ఆయన వాహనాన్ని ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో దంతులూరి రామరాజు తలకు తీవ్ర గాయాలై, అధిక రక్తస్రావం జరిగింది. ఆయనను అంబులెన్స్లో అనకాపల్లిలోని ఎన్.టి.ఆర్ (NTR) ఆసుపత్రికి తరలించగా, అక్కడ వైద్యులు ఆయన అప్పటికే మరణించినట్లు నిర్ధారించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేయబడింది మరియు తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది ఎలమంచిలి రూరల్ ఎస్సై ఉపేంద్ర తెలిపారు
