అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలంలోని జేపీ అగ్రహారం ప్రాథమిక పాఠశాలలో ప్రస్తుతం చదువుతున్న విద్యార్థులకు పూర్వ విద్యార్థులు రామ్మూర్తి నాయుడు, సంతోష్, నాగ రమణలు తమ వంతు సహాయాన్ని అందించారు. విద్యార్థులందరికీ వైట్ యూనిఫాంలను స్పాన్సర్ చేసి పాఠశాల విద్యార్థుల పట్ల తమ అభిమానాన్ని చాటుకున్నారు.పూర్వ విద్యార్థులు అందించిన ఈ సహకారం విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పాఠశాల ఉపాధ్యాయులు తెలిపారు. పాఠశాల అభివృద్ధికి, విద్యార్థుల సంక్షేమానికి ముందుకు వచ్చి యూనిఫాంలను అందించిన రామ్మూర్తి నాయుడు, సంతోష్, నాగ రమణలకు పాఠశాల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
