
నక్కపల్లి, జిల్లావాణి ప్రతినిధి
మాజీ ముఖ్య మంత్రి రాష్ట్ర వైస్సార్ సిపి అధ్యక్షులు వై ఎస్ జగన్మోహన్ రెడ్డిని రాజ్యసభ సభ్యులు, వైస్సార్ సిపి సీనియర్ నాయకులు గొల్ల బాబురావు తాడేపల్లి లోని ఆయన క్యాంపు కార్యాలయం లో గురువారం మర్యాద పూర్వకంగా కలిశారు.ఈ మేరకు బాబురావు ను జగన్మోహన్ రెడ్డి ఆత్మీయతతో పలుకరించి యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు.అనంతరం పలు విషయాలు చర్చించారు.ఈ సందర్బంగా రాబోయే స్థానిక ,మున్సిపల్ ఎన్నికలు ల్లో శత శాతం విజయాలు పొందే విదంగా సీనియర్ నాయకులు ప్రతి ఒక్కరు ఇప్పటినుండి సమాయత్తం కావాలన్నారు.
