అనకాపల్లి జిల్లా మాకవరపాలెం మండలం తూటిపాల లో డేటా సెంటర్ కు అక్టోబరు లో సీఎం చేతుల మీదుగా శంకుస్థాపన ?
మాకవరపాలెం జిల్లా వాణి ప్రతినిధి
మండలంలో తూటిపాల ,అడిగర్లపాలెం పాపయ్య పాలెం పరిధిలో సుమారు 433.3 ఎకరాల లో 1000 మెగావాట్ల హై పవర్ స్కేల్ కోలో కేషన్ డేటాకు ప్రభుత్వం భూమిని కేటాయించింది.
85.200 కోట్లతో నిర్మాణం చేపట్టనున్న ఏపీ గ్రీన్ డేటా సెంటర్ కు అక్టోబర్ లో సీఎం చంద్రబాబు చేతుల మీదుగా శంకుస్థాపన చేయనున్నట్లు సంబంధిత అధికారుల ద్వారా తెలిసింది.
భూములు సర్వే వరకు రెవెన్యూ అధికారులు గ్రామ సభలు నిర్వహిస్తున్నట్లు ఆయా గ్రామ ప్రజల సమాచారం.
ఈ డేటా సెంటర్ వినియోగంలోకి వస్తే ఈ ప్రాంత విద్యార్థిని విద్యార్థులకు మహర్దశ పట్టే అవకాశం ఉంటుందని గ్రామస్తుల ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

