Thursday, April 16, 2026
HomeUncategorizedరోలుగుంట కేజీబీవీ పాఠశాల విద్యార్థులకు కంటి అద్దాలు పంపిణీ.

రోలుగుంట కేజీబీవీ పాఠశాల విద్యార్థులకు కంటి అద్దాలు పంపిణీ.

రోలుగుంట మండలం కేజీబీవీ పాఠశాల విద్యార్థులకు కంటి అద్దాలపంపిణీ

అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం కేజీబీవీ పాఠశాలలో విద్యార్థులకు కంటి అద్దాల పంపిణీ కార్యక్రమం విజయవంతంగా జరిగింది. మంగళవారం అధికారి మండల ఆరోగ్య విస్తరణ గోవిందరావు, వైద్య నిపుణులు శ్రావణి, గోపికృష్ణలు పాల్గొన్న ఈ కార్యక్రమంలో వారం రోజుల ముందు నిర్వహించిన కంటి పరీక్షల ఆధారంగా అవసరమైన విద్యార్థులకు కంటి అద్దాలు పంపిణీ చేశారు. పాఠశాల ప్రిన్సిపల్ తులసి మాట్లాడుతూ, ఈ కార్యక్రమం విద్యార్థుల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ముఖ్యమైనది. మండల ఆరోగ్య శాఖ అధికారుల సహకారానికి ధన్యవాదాలు” అని తెలిపారు. వైద్య నిపుణులు శ్రావణి మరియు గోపికృష్ణలు పరీక్షల సమయంలో విద్యార్థుల కంటి సమస్యలను గుర్తించి, సరైన చికిత్స సలహాలు కూడా ఇచ్చారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular