Thursday, April 16, 2026
HomeUncategorizedజగ్గంపేటలో ఘనంగా వైఎస్సార్‌సీపీ 16వ ఆవిర్భావ దినోత్సవం

జగ్గంపేటలో ఘనంగా వైఎస్సార్‌సీపీ 16వ ఆవిర్భావ దినోత్సవం

వైయస్సార్ జెండాను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు

జగ్గంపేట, మార్చి: 12 (జిల్లా వాణి ప్రతినిధి) కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గ కేంద్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు గురువారం అత్యంత వైభవంగా జరిగాయి. మాజీ శాసనసభ్యులు మరియు వైఎస్సార్‌సీపీ సీఈసీ మెంబర్ జ్యోతుల చంటిబాబు ఆధ్వర్యంలో జగ్గంపేటలోని వారి కార్యాలయంలో ఈ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా చంటిబాబు పార్టీ జెండాను ఆవిష్కరించి, నాయకులు మరియు కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు.ప్రజల పక్షాన నిలిచిన పార్టీ..అనంతరం జ్యోతుల చంటిబాబు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేవలం అధికారం కోసం కాకుండా, ప్రజల మెప్పు పొందిన పార్టీగా, వారి కష్టాల్లో తోడుగా నిలిచే పార్టీగా ఎదిగిందని కొనియాడారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయాలకు అనుగుణంగా ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేశారని, ఆ ఆలోచనా విధానమే పార్టీకి బలమని పేర్కొన్నారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం హామీలను నెరవేర్చడంలో విఫలమైందని, అసమర్థ పాలన సాగిస్తోందని విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యాలపై తాము శాంతియుత పద్ధతిలో నిరసనలు తెలుపుతామని, ప్రజల తరఫున పోరాడతామని డిమాండ్ చేశారు.ఉత్సాహంగా పాల్గొన్న శ్రేణులుజగ్గంపేట నియోజకవర్గవ్యాప్తంగా వచ్చిన భారీ సంఖ్యలో కార్యకర్తలు, వైఎస్సార్ అభిమానులు ఈ వేడుకల్లో పాల్గొని సందడి చేశారు. రాబోయే రోజుల్లో పార్టీని మరింత బలోపేతం చేస్తామని ఈ సందర్భంగా శ్రేణులు ప్రతిజ్ఞ చేశాయి.ఈ కార్యక్రమంలో పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, జ్యోతుల చంటిబాబు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular