Thursday, April 16, 2026
HomeUncategorizedహోంమంత్రి అనిత ఆధ్వర్యంలో రేపు ఇఫ్తార్ విందు

హోంమంత్రి అనిత ఆధ్వర్యంలో రేపు ఇఫ్తార్ విందు

నక్కపల్లి,జిల్లావాణి
పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని పాయకరావుపేట నియోజకవర్గంలో రేపు సాయంత్రం జరగబోయే ఇఫ్తార్ విందు కార్యక్రమానికి ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత ఆధ్వర్యంలో నక్కపల్లి మండలంలో మంత్రి నివాసం వద్ద ఈ ఇఫ్తార్ విందు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి పాయకరావుపేట నియోజకవర్గానికి చెందిన ముస్లిం సోదరులు సుమారు వెయ్యి మంది హాజరుకానున్నారు. రంజాన్ మాసం పవిత్రతను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక ప్రార్థనలు అనంతరం ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయనున్నారు. ఇఫ్తార్ విందు కార్యక్రమానికి హోం మంత్రి అనిత స్వయంగా హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు పాయకరావుపేట నియోజకవర్గానికి చెందిన ముఖ్య నాయకులు నక్కపల్లిలోని మంత్రి నివాసం వద్ద ఏర్పాట్లను పరిశీలించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular