అనకాపల్లి జిల్లా, రోలుగుంట మండలం గ్రామీణ ప్రాంతంలో విద్యాలయంగా నిలిచే రోలుగుంట ప్రభుత్వ జూనియర్ కళాశాల, ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాల్లో అసాధారణ ప్రతిభ కనబరిచి అందరినీ ఆశ్చర్యపరిచింది. మండలం, జిల్లా, రాష్ట్ర స్థాయిలో తన సత్తా చాటుకున్న ఈ రోలుగుంట జూనియర్ కళాశాల, గత కొన్ని సంవత్సరాలుగా నిరంతర విజయాలతో ప్రతిష్టాత్మక పేరు సంపాదించుకుంది. 2024-25 అకడమిక్ సంవత్సరంలో ఇంటర్ రెండవ సంవత్సర పరీక్షల్లో రాష్ట్రవ్యాప్తంగా మొదటి స్థానం కైవసం చేసుకోవడంతో ఈ కాలేజీకి కొత్త గుర్తింపు లభించింది. పలువురు విద్యార్థులు 100% శాతం మార్కులతో పాస్ అవుతూ,అందరి ప్రశంసలు అందుకున్నారు.2025-26 సంవత్సరానికి కూడా జిల్లా స్థాయిలో మొదటి స్థానం సాధించిన ఈ కళాశాల విద్యార్థులు, రాష్ట్రంలోని అతి ప్రతిష్టాత్మకమైన ఉన్నత కళాశాలల్లో ఎంపికయ్యారు. ఇంటర్ ఫలితాల ఆధారంగా విట్స్, ఐఐటి వంటి పరీక్షల్లో అర్హత పొందిన వారు, భవిష్యత్ విద్యాభ్యాసంలో బలమైన పునాది వేసుకున్నారు. “ఇది మా కళాశాలకు గర్వకారణం. కళాశాల ప్రారంభం నుంచి జిల్లా, రాష్ట్ర స్థాయిలో మంచి గుర్తింపు, మంచి పేరు ఉంది. విద్యార్థులు, అధ్యాపకుల కృషి ఫలితంగానే ఈ విజయాలు సాధ్యమయ్యాయి” అని ప్రిన్సిపల్ అప్పలరాజు తెలిపారు. జిల్లా విద్యా అధికారులు, స్థానిక నాయకులు, పెద్దలు ఈ సాఫల్యాన్ని ప్రశంసిస్తూ అభినందనలు తెలిపారు.
కళాశాలలో గణిత అధ్యాపకుడిగా పనిచేస్తున్న సాయి మాస్టారు (సహదేవుడు) గత సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం చేత ఉత్తమ అధ్యాపకునిగా పురస్కారం పొందారు. ఈ పురస్కారం కళాశాల ప్రతిష్టకు మరింత గర్వకారణం. విద్యార్థుల పట్ల అధ్యాపకుల అంకిత భావం, క్రమశిక్షణ, నిరంతర మార్గదర్శకత్వం వలన ఈ ఫలితాలు వచ్చాయి. గ్రామీణ ప్రాంతాల్లోని చిన్న చిన్న గ్రామాల నుంచి వచ్చే విద్యార్థులు, పరిమిత సౌకర్యాల మధ్య ఈ స్థాయి ప్రదర్శన చేయడం అందరికీ ప్రేరణ. కళాశాల ప్రారంభం నుంచి జిల్లా, రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందిన ఈ సంస్థ, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధిస్తుందని అంచనా.రోలుగుంట ప్రభుత్వ జూనియర్ కళాశాల ఇంటర్ ఫలితాల్లో ప్రభంజనం సృష్టిస్తూ, గ్రామీణ విద్యార్థులకు అమోఘ ప్రేరణగా నిలుస్తోంది. ఇలాంటి విజయాలు గ్రామీణ విద్యా వ్యవస్థకు కొత్త నిర్వచనం తెలిపుతూ చుట్టుపక్కల పల్లె ప్రజలకు తల్లిదండ్రులకు ఆదర్శంగా విద్యార్థులకు ఆకర్షణీయంగా నిలవడంతో కాలేజీ ప్రిన్సిపల్ అప్పలరాజుతో పాటు సిబ్బందికి పలువురు ప్రజా ప్రతినిధులు అధికారులు ప్రశంసలు కురిపిస్తున్నారు.ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ ఎం. అప్పలరాజుతో పాటు అధ్యాపకులు బి. సహదేవుడు. సాయి మాస్టర్, పి. మల్లికార్జున రావు, ఎల్. తులసి,
పి. శ్రీనివాసరావు (సివిక్స్), పి. శ్రీనివాసరావు (తెలుగు), కె. సురేష్ కుమార్, ఎం.ఎ.వి. ప్రసాద్, కె.ఎస్.ఎస్. శ్రీనివాసరావు, కె. విజయకుమార్, ఎస్. సత్తిబాబు, బి.వి.వి. సత్యనారాయణ మరియు కార్యాలయ సిబ్బంది. ఎం. పద్మావతి, ఒ. నందకిషోర్, ఎ. పవన్ తదితరులు పాల్గొన్నారు.
రోలుగుంట జూనియర్ కళాశాల ఇంటర్ పరీక్షల్లో అద్భుత ప్రభంజనం రాష్ట్ర జిల్లా స్థాయిలో అగ్రస్థానం కైవసం.
RELATED ARTICLES
