జగ్గంపేట, మే 23: కాకినాడ జగ్గంపేట మండల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బూత్ లెవెల్ ఏజెంట్ల (BLA) నియామక పత్రాలను శనివారం స్థానిక తహశీల్దార్ (MRO) కార్యాలయంలో అందజేశారు. జగ్గంపేట నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్, మాజీ మంత్రి, మాజీ ఎంపీ తోట నరసింహం ఆదేశాల మేరకు ఈ ప్రక్రియను పూర్తి చేసినట్లు పార్టీ ప్రతినిధులు తెలిపారు. జగ్గంపేట మండల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రావుల గణేష్ రాజా ఆధ్వర్యంలో పార్టీ నాయకులు తహశీల్దార్ను కలిసి అధికారికంగా ఈ నియామక పత్రాలను సమర్పించారు. రాబోయే ఎన్నికల ప్రక్రియను నిబంధనల ప్రకారం, పారదర్శకంగా నిర్వహించడంలో బూత్ లెవెల్ ఏజెంట్ల పాత్ర అత్యంత కీలకమని ఈ సందర్భంగా నాయకులు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పబ్లిసిటీ విభాగం జనరల్ సెక్రెటరీ రామకుర్తి జగదీశ్వరరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి వరపుల సూరిబాబు, నియోజకవర్గ వాణిజ్య విభాగం అధ్యక్షుడు కరుటూరి వీర్రాజు, జగ్గంపేట టౌన్ అధ్యక్షులు కాపవరపు ప్రసాద్ పాల్గొన్నారు. అలాగే RTI విభాగం అధ్యక్షుడు గిడియాల పెద్దకాపు, నియోజకవర్గ సోషల్ మీడియా అధ్యక్షుడు కాపవరపు రమణ, సీనియర్ నాయకులు చింతా భద్ర రావు, జగ్గంపేట మండల ఉపాధ్యక్షుడు వానాసి సుబ్రహ్మణ్యం, మండల జనరల్ సెక్రెటరీ నక్కరాజు వీరబాబు, చింత శివ, సపిరెడ్డి సత్తిబాబులతో పాటు పెద్ద సంఖ్యలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

