అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం రత్నంపేట గ్రామానికి చెందిన సాడి రాజు అనే మహిళ అనారోగ్యంతో బాధపడుతూ అత్యవసరంగా రక్తం అవసరమైన పరిస్థితి ఏర్పడింది. ఈ విషయం స్థానిక జనసైనికుల దృష్టికి తీసుకురాగానే వారు వెంటనే స్పందించారు.తక్షణ చర్యగా అవసరమైన రక్తాన్ని సమకూర్చి, బాధిత మహిళకు అందజేశారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులు జనసైనికులకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో పెద్దడ నాగేశ్వరరావు (యూత్ ప్రెసిడెంట్), సనివాడ సోమాల నాయుడు (గ్రామ అధ్యక్షులు), సిరిసిపల్లి శివ (కమిటీ సభ్యులు) తదితరులు పాల్గొన్నారు.
అనారోగ్యంతో బాధపడుతున్న మహిళకు జనసేనకులు సహాయం.
RELATED ARTICLES
