
రాంబిల్లి మండలం వి ఆర్ అగ్రహారం గ్రామంలో రెండో విడత సెజ్ లో పోయిన భూముల్లో ఇళ్లను తహసిల్దార్ పి సత్యనారాయణ దౌర్జన్యంగా దగ్గరుండి యంత్రాలతో పడగొట్టిస్తున్నారు. ఇటీవల నిర్వాసితులకు షెడ్యూల్ దిబ్బపాలెం పునరావాస్ కాలనీలో స్థలాలు కేటాయించారు వీరికి పట్టాలిచ్చి నెల రోజులు అవుతుంది స్థలాలు ఇచ్చిన చోట ఇల్లు నిర్మాణం చేసుకోనీయకుండా తమ నివాసాలను బలవంతంగా కూలగొట్టడంపై నిర్వాసితులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు కుటుంబాలతో తాము ఎక్కడికి పోవాలంటే లబో దీపం అంటూ రోదిస్తున్నారు ప్రభుత్వ దుర్మార్గ చర్యలను ప్రతి ఒక్కరు ఖండించాలని నిర్వాసితులు కోరుతున్నారు
