Thursday, April 16, 2026
HomeUncategorizedసహకార సంఘ ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరించిన కూటమి ప్రభుత్వము* *ఏలేశ్వరం లో స్వీట్లు పంచుకొని...

సహకార సంఘ ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరించిన కూటమి ప్రభుత్వము* *ఏలేశ్వరం లో స్వీట్లు పంచుకొని సంబరాలు జరుపుకున్న సహకార సంఘాల సిబ్బంది*

సహకార సంఘ ఉద్యోగుల డిమాండ్లను పరిష్కార దిశగా కూటమి ప్రభుత్వము, ఇచ్చిన హామీపై సమ్మెను విరమించామని సహకార సంఘ ఉద్యోగులు తెలిపారు.

ఏలేశ్వరం పట్టణం జిల్లా కేంద్ర సహకార బ్యాంకు వద్ద గత 90 రోజులుగా వివిధ దశలలో సహకార సంఘ ఉద్యోగులు తమ డిమాండ్లను పరిష్కరించాలని నిరసన కార్యక్రమాలు చేపట్టారు.

సహకార సంఘాల రాష్ట్ర జె ఏ సి పిలుపు మేరకు గత తొమ్మిది రోజులుగా విధులను బహిష్కరించి సమ్మెను తీవ్రతరం చేశారు
ఈ నేపథ్యంలో సహకార సంఘాల ఉద్యోగుల సహకార శాఖా మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు మరియు ఉన్నత అధికారుల సమక్షంలో రాష్ట్ర జేఏసీ నాయకత్వం రాజధానిలో చర్చలు జరిపారు.
ఈ చర్చలు ద్వారా
గ్రాట్యుటీ 4 లక్షలు,
ఐ ఆర్ 20%,
భీమా 5 లక్షలు అమలుకు ప్రభుత్వము ఆమోదంపై హర్షణ వ్యక్తం చేశారు.
సహకార సంఘ ఉద్యోగులతో పాటు బ్యాంకు సిబ్బంది స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు జరుపుకున్నారు.
సహకార సంఘాల జిల్లా అధ్యక్షులుగా సమ్మెను విజయవంతగా ముందుకు నడిపించిన జిల్లా అధ్యక్షులు ఆదినారాయణ ను సంఘ సభ్యులు సన్మానించారు.

ఈ సందర్భంగా ఆదినారాయణ మాట్లాడుతూ
సహకార ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరించిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
మిగిలిన డిమాండ్ల పై కమిటీ వేసి త్వరలో పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం జరిగిందని వాటిని కూడా నెరవేర్చిగా ప్రభుత్వం పని చేయాలని కోరారు. గత 90 రోజులుగా వివిధ దశలలో నిరసన తెలుపుతున్న రాష్ట్ర సహకార సంఘాల ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈరోజు నుండి యధావిధిగా విధుల్లో కొనసాగుతామని ఆయన మిడియా ముఖంగా వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో సీఈవో లు
జ్యోతుల నాగ సత్య శ్రీనివాస్, యు విజయకుమార్ రాజు, జే గోపాలకృష్ణ, ఆనందం మరణిరాజు, డిసిసిబి మేనేజర్ రవికృష్ణ,
ఏలేశ్వరం లింగంపర్తి, యల్లవరం, రాజవొమ్మంగి, సహకార సంఘాల ఉద్యోగులు పాల్గొన్నారు.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular