

అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం రోలుగుంట కొండపై వెలసిన శ్రీ శ్రీ జగ్గారాయుడు స్వామివారి దేవాలయం వద్ద ఆదివారం భారీ అన్న సమారాధన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కమిటీ నిర్వాహకులు తెలిపారు. వందల సంవత్సరాలు చరిత్ర కలిగిన ఈ దేవాలయం దర్శనం చేసుకుని పరీక్షలకు వెళితే విద్యార్థులకు మంచి జరుగుతుందని నమ్మకం. అన్న సమారాధన కార్యక్రమానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు తరలిరావాలని వారికి కావాల్సినన్ని సదుపాయాలు ఏర్పాటు చేశామని నిర్వాహకులు తెలిపారు.
