అనకాపల్లి జిల్లా నర్సీపట్నం ఆర్డీవో కార్యాలయం ఏవోగా వెంకటరమణ బాధ్యతలు స్వీకారం నర్సీపట్నం ఆర్డీవో కార్యాలయంలో పరిపాలన అధికారిగా (ఏవో) బి. వెంకటరమణ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కార్యాలయ సిబ్బంది ఆయనకు ఆత్మీయ స్వాగతం పలికారు.ఇంతకుముందు మాకవరపాలెం తహశీల్దార్గా విధులు నిర్వహించిన వెంకటరమణ, బదిలీపై నర్సీపట్నం ఆర్డీవో కార్యాలయానికి వచ్చారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డివిజన్ పరిధిలో ఉన్న రెవెన్యూ సమస్యలను సిబ్బంది సహకారంతో సమన్వయంగా పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు.
నర్సీపట్నం ఆర్డిఓ కార్యాలయంలో ఏవో గా బాధ్యతలు చేపట్టిన బి.వెంకటరమణ.
RELATED ARTICLES
