నక్కపల్లి, జిల్లావాణి
పదవతరగతి పరీక్షల్లో విద్యార్థులు శతశాతం ఉత్తీర్ణత సాధించిన వారికీ తగిన ప్రోత్సాహం అందించి నగదు బహుమతి అందజేయడం జరుగుతుందని రాజయ్యపేట టిడిపి గ్రామశాఖ అధ్యక్షులు పిక్కి గంగరాజు అన్నారు. ఈ మేరకు శనివారం గ్రామం లోని జిల్లాపరిషత్ పాఠశాల లో విద్యార్థులకు హల్ టికెట్ లు అందజేశారు. ఈ సందర్బంగా గంగరాజు మాట్లాడుతూ రాష్ట్ర హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత ఆశయ సాధన కోసం పదో తరగతి విద్యార్థులు 100% శాతం మార్కులతో ఉత్తీర్ణులు అవ్వాలని గురువులకు తల్లిదండ్రులకు, గ్రామానికి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని ఆకాంక్షించారు.అలాగే
100% శాతం మార్కులతో పరీక్షలు ల్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు ప్రధమ బహుమతిగా 5000 రూపాయలు,ద్వితీయ బహుమతి గా 3000 రూపాయలు, తృతీయ బహుమతి గా 2000 రూపాయలు నగదు ఇవ్వడం జరుగుతుందని అన్నారు.విద్యార్థులు అందరికి ఈ సందర్బంగా శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు,టీడీపీ నాయకులు,జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి బొంది గుర్రన్న తదితరులు పాల్గొన్నారు.
పదవతరగతి పరీక్షల్లో శత శాతం ఉత్తీర్ణత సాధించే విద్యార్థులకు బహుమతులు
RELATED ARTICLES
