
అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలం లింగంపేట పంచాయతీలో జనసేన ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఉద్యమి సభ్యత్వం మంగళవారంతో ముగుస్తుంది కాబట్టి జనసేన ఆశయాలు సిద్ధాంతాలు, పవన్ కళ్యాణ్ గారి సేవ గుణాలు నచ్చి జనసేన పార్టీలో ఉద్యమి సభ్యత్వం చేసుకోవడానికి ఆసక్తిగా ఉన్నవాళ్లు త్వరగా చేసుకోవాలని గొలుగొండ మండల ప్రధాన కార్యదర్శి సలాదులు ప్రసాద్ బాబు తెలియపరచడం జరిగింది. ఈ కార్యక్రమంలో మరిసా స్వామి నాయుడు, మద్దపు కామనాయుడు, ఎలిసెట్టి సాయికుమార్, పాతాళ కుశరాజు, మాడెం నాగేశ్వరావు, కర్రీ శ్యాం కుమార్ తదితరులు పాల్గొన్నారు
