నక్కపల్లి, జిల్లావాణి
వైస్సార్సిపి బలోపేతానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం పరిశీలకులు వీసం రామకృష్ణ పిలుపునిచ్చారు. ఈ మేరకు 33వ వార్డుకు సంబందించిన ఆరు సచివాలయాల పరిధిలో పార్టీ నూతన కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపే కార్యక్రమం లో మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ తో వీసం పాల్గొన్నారు.అనంతరం కమిటీ సభ్యులకు స్వీట్స్ పంచి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా వీసం మాట్లాడుతూ పార్టీ కి పూర్వ వైభవానికి ప్రతి ఒక్కరు అహర్నిశలు కష్టపడి పనిచేయాలని రాబోయే రోజుల్లో కార్యకర్తలకు పార్టీ లో సముచిత స్థానం ఉంటుందని జగన్ మోహన్ రెడ్డి ని ముఖ్య మంత్రి ని చేయడానికి కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమం లో జనసేన పార్టీ కి చెందిన వాడపర్తి కనక రత్నం వైస్సార్ సిపి లో చేరారు. కనక రత్నంకు పలువురు నాయకులు శుభాకాంక్షలు తెలిపారు.
విశాఖ దక్షిణ నియోజకవర్గంలో పూర్టైన వైస్సార్ సిపి నూతన కమిటీలు
RELATED ARTICLES
