నక్కపల్లి,జిల్లావాణి
మండలంలోని రాజయ్యపేట వద్ద ఆర్సె లాల్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన కార్యక్రమానికి ఉప ముఖ్య మంత్రి జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ వచ్చిన నేపథ్యంలో హెలి పాడ్ వద్ద హోం మంత్రి అనిత, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్, పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్ లతో పాటు జిల్లా బీజేపీ నాయకులు కోసూరు శ్రీను వాసరావు పవన్ కళ్యాణ్ కు ఘనంగా స్వాగతం పలికారు.ఈ సందర్బంగా పవన్ కళ్యాణ్ శ్రీను ని ఆత్మీయంగా చిరునవ్వుతో పలకరించారు.ఈ మేరకు నక్కపల్లి కి భారీ స్టీల్ ప్లాంట్ మంజూరు అయ్యేలా కృషి చేసినందుకు పవన్ కళ్యాణ్ కు పాయకరావుపేట నియోజకవర్గం ప్రజలు తరపున శ్రీను ధన్యవాదములు తెలిపారు. ఈ సందర్బంగా శ్రీను మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం సహకారం తో ముఖ్య మంత్రి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చేస్తున్న కృషికి ఈ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందుతుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆశీస్సులు తో నక్కపల్లి కి ప్రపంచ పటం లో ఒక ప్రత్యేక స్థానం ఉండబోతుందని ఈ భారీ ఉక్కుకర్మా గారము తో యువతకు మరెన్నో ఉపాధి అవకాశాలు లభిస్తాయని అన్నారు.
