Friday, June 5, 2026
HomeUncategorizedమధ్యాహ్నం భోజన పథకాన్ని ప్రైవేటీకరణ చెయ్యొద్దు సిఐటియు.

మధ్యాహ్నం భోజన పథకాన్ని ప్రైవేటీకరణ చెయ్యొద్దు సిఐటియు.

మధ్యాహ్నం భోజనం పథకాన్ని ప్రైవేటుపరం చేయొద్దని అనకాపల్లి జిల్లా రోలుగుంట ఎంఈఓ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. అనంతరం సిఐటియు నాయకులు కే ప్రసన్న మాట్లాడుతూ స్మార్ట్ కిచెన్ పేరుతో ప్రభుత్వం మధ్యాహ్న భోజనం పథకాన్ని ప్రైవేటుపరం ప్రయత్నిస్తుందని ఈ పథకంలో జిల్లావ్యాప్తంగా నాలుగు వేల మంది మహిళలు పనిచేస్తున్నారని అన్నారు. పథకాన్ని ప్రైవేటుపరం చేస్తే ఈ 4000 మంది పరిస్థితి ఏంటి అని నిడదీశారు. ఈ పథకాన్ని ప్రైవేటుపరం చేయడం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. మధ్యాహ్నం భోజనం కార్మికులకు ప్రభుత్వం కనీస వేతనాలు 10000 ఇవ్వాలని ఐడి కార్డులు ఇవ్వాలని యూనిఫారం భీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు ఈరెల్లి చిరంజీవి మధ్యాహ్నం భోజనం సంగం నాయకులు అమ్మాజీ, రమ, వరహాలమ్మ, ఈశ్వరమ్మ, పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular