
అనకాపల్లి జిల్లా యలమంచిలి రూరల్ పోలీస్ స్టేషన్ లో వేసవి కాలం ప్రారంభమవుతున్న నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో దొంగతనాలు జరిగే అవకాశాలు అధికంగా ఉండటాన్ని దృష్టిలో ఉంచుకుని, యలమంచిలి రూరల్ పోలీస్ స్టేషన్ వారు ప్రజలను అప్రమత్తం చేయడానికి పలు చర్యలు చేపట్టారు. గ్రామాలలో ఆటోలకు ప్లెక్సీలు ఏర్పాటు చేసి, మైక్ ద్వారా దొంగతనాల నివారణకు సంబంధించిన జాగ్రత్తలను తెలియజేస్తూ ప్రచారం నిర్వహించారు. అలాగే వాహన తనిఖీలు నిర్వహించే సమయంలో మరియు గ్రామ సందర్శనల సందర్భంగా పాంప్లెట్లు పంపిణీ చేయడం ద్వారా ప్రజలకు అవగాహన కల్పించారు. అదేవిధంగా రద్దీగా ఉండే ప్రదేశాల్లో పాంప్లెట్లు అతికించడం ద్వారా భద్రతపై ప్రజల్లో చైతన్యం పెంచుతున్నారు. ఈ విధంగా యలమంచిలి రూరల్ పోలీసులు దొంగతనాల నివారణకు సంబంధించి సమర్థవంతమైన చర్యలు చేపట్టి ప్రజల్లో భద్రతా అవగాహన పెంపొందించేందుకు కృషి చేస్తున్నారు
