గబ్బాడ గ్రామం లో గురువారం రాత్రి 11 గంటలకు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల నడిగట్ల మంగ గారి పాక ఇల్లు దగ్ధం అయింది. సుమారు 2లక్షలు ఆస్తి నష్టం జరిగినట్టు ప్రాథమిక అంచనా వేశారు. విషయం తెలుసుకున్న వెంటనే జనసేన నాయకులు పోతల గణేష్ సంఘటన స్థలానికి వెళ్లి సహాయ కార్యక్రమాలు చేశారు. శుక్రవారం జనసేన నియోజకవర్గం నాయకులు శ్రీ అప్పన దొరబాబు సంఘటన స్థలానికి వెళ్లి 20వేలు రూపాయలు ఆర్థిక సహాయం చేశారు మరియు నెలకు సరిపడే 5 వేల రూపాయలనిత్యవసర సరుకులు ఆ కుటుంబానికి అందించడం జరిగింది.ఈ కార్యక్రమం లో నర్సీపట్నం టౌన్ పార్టీ ప్రెసిడెంట్ అద్దేపల్లి గణేష్ , మారిశెట్టి రాజా , p. శ్రీను , రామకృష్ణ , ప్రేమ్ కుమార్ , బాలు, ఆది,పూడి త్రినాధ్ , బాల్లేపల్లి కిట్టు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు..

