
గొలుగొండ మండలం జోగంపేట గ్రామంలో శ్రీ గౌరీ పరమేశ్వర ఉత్సవాలు భక్తులు ఘనంగా నిర్వహించారు.ఈ ఉత్సవాలకు వివిధ గ్రామాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. భక్తులు శివపార్వతుల దర్శనం చేసుకొని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాటు చేసిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో, ఆధ్యాత్మిక వాతావరణంలో విజయవంతంగా జరుగుతున్నాయి వచ్చే భక్తులకు తోపులాటలు జరగకుండా ఆలయ కమిటీ వారు అన్ని సౌకర్యాలు కల్పించారు
