కోటనందూరు, జిల్లా వాణి ప్రతినిధి
కాకినాడ జిల్లా, కోటనందూరు మండలం, అల్లిపూడి కస్తూర్బా గాంధీ విద్యాలయంలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరంలో ర్యాంకులు సాధించిన ఇద్దరు విద్యార్థులను కలెక్టర్ హరీందర్ ప్రసాద్ ప్రశంసించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ జి రాజేశ్వరి తెలియజేశారు. ప్రథమ స్థానం సాధించిన పులి బుజ్జి 952/1000, ద్వితీయ స్థానం సాధించిన బంగారు మాధవి 939/1000 లకు జ్ఞాపికలు అందించారని వీరికి ఆర్జెడి నాగమణి, డీఈఓ పి రమేష్, జి సి డి వో డి ఉమామహేశ్వరి తదితరులు అభినందించినట్లు తెలియజేశారు.
