
మాసిక వత్తిడి ఉరివేసుకుని చనిపోయన యువకుడు యలమంచిలి టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక వ్యక్తి ఉరివేసుకుని మృతి చెందిన ఘటనకు సంబంధించిన ఫిర్యాదు అందినది. అలుగోలు శ్రీనివాసరావు అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు, అతని కుమారుడు అలుగోలు వీర వెంకట శివ నాగేశ్వరరావు (27 సంవత్సరాలు) యలమంచిలిలో నివాసం ఉంటూ వ్యక్తిగత కారణాలతో మానసిక వేదనకు గురై ఉరివేసుకుని మృతి చెందినట్లు తెలియజేశారు.ఫిర్యాదు అందుకున్న వెంటనే యలమంచిలి టౌన్ పోలీస్ వారు సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించి, సంబంధిత ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు. ఘటన స్థలంలో లభించిన డైరీని కూడా స్వీకరించి దర్యాప్తులో భాగంగా పరిశీలిస్తున్నాము.ప్రాథమిక విచారణలో, చిన్నప్పటి నుండి తనని పెంచి పెద్ద చేసిన తన మేనమామ మరియు పెద్దమ్మ చనిపోయారని, మానసిక ఆందోళనకు గురై ఆత్మహత్య చేసుకున్నట్లు పిర్యాదు చెయ్యగా, డైరీలో కూడా అదే విషయాన్ని రాసుకోవడం జరిగింది. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాము స్టేషన్ హౌస్ ఆఫీసర్యలమంచిలి టౌన్ పోలీస్ స్టేషన్

RELATED ARTICLES
