

వెలంకాయలపాలెం గ్రామంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్యక్రమం
అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం వెలంకాయలపాలెం,ఎన్డీఏ కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో రోలుగుంట మండలం వెలంకాయలపాలెం గ్రామంలో ఉదయం నుంచి పారిశుద్ధ్య కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలోని అన్ని సైడ్ కాలువలను శుభ్రపరిచి, చెత్తాచెదారాన్ని తొలగించారు. పౌరులకు తడి, పొడి చెత్తను వేరువేరుగా ఉంచి, చెత్త నుండి సంపద తయారు చేసే విధానాన్ని వివరించారు. కార్యక్రమంలో గ్రామ యువకులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. ప్రజలంతా ఏకమై గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుతామని ప్రతిజ్ఞ చేశారు కార్యక్రమాన్ని గ్రామ యువకులైన బెజవాడ వాసు వేలం కాయల సత్తిబాబు దగ్గరుండి నిర్వహించారు.
