అనకాపల్లి జిల్లా మండల కేంద్రమైన రోలుగుంట సెక్టార్ పరిధిలో అంగన్వాడీ కార్యకర్తలు తమ డిమాండ్ల సాధన కోసం ఆందోళనకు దిగారు.మండల కార్యాలయం వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో అంగన్వాడీ వర్కర్లు తాసిల్దార్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. అనంతరం రోలుగుంట మెయిన్ రోడ్డు కూడలిలో మానవహారం ఏర్పాటు చేసి రోలుగుంట మండల కేంద్రంలో.
అంగన్వాడీలు భారీ ర్యాలీ. మానవహారం.
విజయవాడలో అంగన్వాడి నాయకులు పై అక్రమ కేసులు ఎత్తివేయాలంటూ. వెంటనే విడుదల చేయాలంటూ. జీతాలు పెంచే వరకు పోరాడుతామని తమ నిరసనను వ్యక్తం చేశారు. దీనిపై ప్రభుత్వం వెంటనే స్పందించి అంగన్వాడీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన బాట పట్టినట్లు రాష్ట్ర నాయకులు తెలిపారు.అంగన్వాడీ కార్మికుల హక్కులు, వేతనాల పెంపు తదితర డిమాండ్లపై ప్రభుత్వం స్పందించాలని వారు కోరారు.
