
అధ్యక్షుడు గుటాల చిన్న ఆధ్వర్యంలో పండిట్ దీన్దయాల్ ఉపాధ్యాయ వర్ధంతి స్మరణోత్సవం.
అనకాపల్లి జిల్లా రావికమతం మండల అధ్యక్షుడు, మేడివాడ కోపరేటివ్ చైర్మన్ గుటాల చిన్న ఆధ్వర్యం పండిట్ దీనదయాల్ ఉపాధ్యాయ వర్ధంతి వేడుకలను అద్భుతమైన నివాళి పద్ధతిలో ఘనంగా నిర్వహించారు. ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసి, నూతన వస్త్రాలు ధరించి దేవాలయానికి వెళ్లేలా తయారై, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారని చిన్న తెలిపారు.ఈ సందర్భంగామాట్లాడిన గుటాల చిన్న, “భారతమాతకు అంకితమైన మహానేత పండిట్ దీనదయాల్ ఉపాధ్యాయ వర్ధంతిని మనం ఘనంగా స్మరించుకోవాలి. ఆయన జీవితమంతా దేశ సేవకే అంకితం చేశారు. చిన్ననాటి నుంచి అనేక కష్టాలు ఎదురైనా, దేశభక్తి, సమాజ సేవ పట్ల ఆయన నిబద్దత తప్పకుండా ఉండేది” అని పేర్కొన్నారు. భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకుల్లో ఒకరైన ఉపాధ్యాయ దేశ రాజకీయాల్లో సాంస్కృతిక విలువలు, జాతీయత, సమగ్ర అభివృద్ధి సిద్ధాంతాలను ప్రవేశపెట్టారు. “అంత్యోదయ” మరియు “ఏకాత్మ మనవత్వ సిద్ధాంతం” ఆయన ప్రతిపాదనలు భారత అభివృద్ధికి మార్గదర్శకాలుగా నిలిచాయి. సమాజంలో చివరి వ్యక్తి అభివృద్ధి చెందితేనే దేశం ముందుకు సాగుతుందని ఆయన నమ్మకం. పేదలు, రైతులు, కార్మికులు, మధ్యతరగతి ప్రజల కోసం చేసిన సేవలు ఎన్నటికీ మరచిపోలేనివని చిన్న ప్రస్తావించారు. దేశ సేవే ధర్మమని భావించి, వ్యక్తిగత జీవితం గురించి ఆలోచించకుండా కష్టపడిన మహానుభావుడు ఉపాధ్యాయ 1968లో అనుమానాస్పద పరిస్థితుల్లో ప్రాణత్యాగం చేశారు. దేశం కోసం జీవించి, దేశం కోసం ప్రాణాలు అర్పించిన గొప్ప దేశభక్తుడు ఆయన అని చిన్న పేర్కొన్నారు. “మనం ఆయన చూపిన మార్గంలో నడుస్తూ సమాజ సేవ, దేశ సేవ చేయాలి” అని కోరారు. కార్యక్రమంలో బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి దంట్ల సత్యనారాయణ, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
