ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు తెలిపిన రోలుగుంట జనసేన కోకన్వీనర్ బుంగ కోటి.

ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి మరియు పంచాయతీరాజ్ శాఖ మంత్రివర్యులు శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ కి కృతజ్ఞతలు రోలుగుంట మండలంలో 99 లక్షలతో బీటీ రోడ్ల నిర్మాణం రోలుగుంట మండల ప్రజల తరపున, రోలుగుంట జనసేన పార్టీ తరపున, అలాగే మండల కో-కన్వీనర్ బుంగా కోటి తరపున, ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి మరియు పంచాయతీరాజ్ శాఖ మంత్రివర్యులు గౌరవనీయులైన శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ రోలుగుంట మండలంలో బీటీ రోడ్ల నిర్మాణానికి 99 లక్షల రూపాయల నిధులను మంజూరు చేసినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఈ నిధులు మండలంలో రవాణా వ్యవస్థను మెరుగుపరచడంతో పాటు, ప్రజల దైనందిన జీవితాన్ని సులభతరం చేస్తాయి. ఈ నిధులు రావడంలో కీలక పాత్ర పోషించిన చోడవరం జనసేన పార్టీ ఇంచార్జ్ శ్రీ పివిఎస్ఎన్ రాజుకి కూడా మా ప్రత్యేక ధన్యవాదాలు. ఇలాగే నిరంతరం ప్రజా సంక్షేమం కోసం కృషి చేస్తారని ఆశిస్తున్నాము.
