


పోలవరం జిల్లావాణి ప్రతినిధి: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు, మాజీ ఎంపీ తడపట్ల రత్నబాయి ఆదివారం రాత్రి అకాల మరణం చెందారు. ఈ విషయం తెలుసుకున్న రంపచోడవరం నియోజకవర్గ స్థానిక మాజీ శాసనసభ్యులు సీతంశెట్టి వెంకటేశ్వరరావు , చిన్నం బాబు రమేష్ , వంతల రాజేశ్వరి మరియు ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ఎస్టి కమిషన్ మెంబర్ గొర్లె సునీత చక్రవర్తి దంపతులు , మాజీ సర్పంచ్ వై నిరంజని దేవి, మాజీ ఎంపీపీ కారం శేషాయమ్మ, సాధల సత్యవతి,సంకూరు పెంటమ్మ తదితరులు తడపట్ల రత్నబాయి భౌతిక దేహాన్ని నివాళులు అర్పించారు
